మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై వృథాగా పోతున్న నీరు

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై వృథాగా పోతున్న నీరు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గండి తండా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై నీరంతా వృథాగా పోతోంది. పైప్ లైన్ పగిలిపోవడంతో అందులో నుంచి వాటర్ పైకి ఎగిసిపడుతోంది. పక్కన రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు అక్కడే సెల్ఫీలు దిగుతున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపు నుంచి నీరు లీకేజీ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇంటింటికి మంచినీటి సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే.. కొన్నిచోట్ల తరచూ పైప్ లైన్ లు లీకై నీరంతా వృథాగాపోతుండడంపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.