
- ప్రజాతీర్పుకు కట్టుబడి ఉంటం: కవిత
మెట్పల్లి/జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, అందుకే ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండా లని తీర్పు ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నా రు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామని అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఇంట్లో ఆమె మీడియాతో మాట్లా డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను ప్రజలకు చేరే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొన్ని రోజుల్లోనే అధికార దుర్వినియోగానికి పాల్ప డుతున్నదని మండిపడ్డారు. జగిత్యాల, నిజా మాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకు లపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.