
హైదరాబాద్లో అర్థరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 23వ తేదీ రాత్రి దేవేందర్ గాయన్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ డీసీపీ సందీప్, మియాపూర్ పోలీసులు అక్కడ 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరణించిన దేవేందర్ గాయన్ కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేవేందర్ స్వస్థలం కోల్కతాగా పోలీసులు తెలిపారు. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో దుండగులు బైక్పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారని చెప్పారు. కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్ని ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు. దేవేందర్ 6 నెలలుగా కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కాల్పులకు పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.