చల్లా ధర్మారెడ్డి మాటల్లో తప్పు లేదు

చల్లా ధర్మారెడ్డి మాటల్లో తప్పు లేదు

హైదరాబాద్: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. అగ్రవర్ణాలు మాట్లాడే మాటలను ఆయన బహిరంగంగా చెప్పారని స్పష్టం చేశారు. చల్లా క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కొంతమంది కావాలనే రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఆయనను ఎవరూ భర్తరఫ్ చేయలేరని.. ఆందోళనలు చేస్తున్న వారు ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ‘తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లే బదులు స్వరాష్ట్రంలోని యాదాద్రి, భద్రాచలం గుళ్లకు వెళ్లాలి. తిరుపతి హుండీలో వేస్తున్న కట్నాల వల్లే అక్కడ అభివృద్ధి జరుగుతోంది. రానున్న రోజుల్లో జై శ్రీరాం, జై భీమ్ మధ్య యుద్ధం జరగనుంది’ అని పిడమర్తి పేర్కొన్నారు.