పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ 

పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ 

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు: పట్టణాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్​ మురళీనాయక్​ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని ఈదుల పూసంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ నిధుల నుంచి మంజూరైన రూ.5 లక్షలతో  సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​పార్టీ జిల్లా, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.