- లిస్ట్ను ప్రకటించిన ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మున్సిపల్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను డీసీసీ అధ్యక్షుడు పి.రఘునాథ్ రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంగళవారం ప్రకటించారు. పీసీసీ, డీసీసీ, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగానే కౌన్సిలర్అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. టికెట్లు రానివారు అసంతృప్తికి గురికావద్దని, వారికి భవిష్యత్లో పార్టీ పరంగా నామినేటెడ్పదవులు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య పాల్గొన్నారు.
