అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువు, క్రీడలు రెండూ ముఖ్యమే అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణ పరిధిలోని మైత్రి మైదానంలో పటాన్చెరు ప్రైవేట్ రికగ్నైజెడ్స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రైవేటు స్కూల్స్క్రీడా పోటీలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటలపై ఆసక్తిని పెంపొందిస్తే మానసిక వికాసం, శారీరక ధారుడ్యం లభిస్తుందన్నారు. ర్యాంకుల మాయలో పడి క్రీడలను నిర్లక్ష్యం చేయొద్దని పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, రాఘవేంద్రా రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసొసియేషన్నియోజకవర్గ అధ్యక్షుడు సాయితేజ, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
