
మహబూబాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన 79 వ స్వాతంత్ర వేడుకలకు ఆయన హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 588 రేషన్ షాపుల ద్వారా 2.43వేల కార్డుదారులకు మూడు నెలల కోటా 144,14,034 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
జిల్లాలో వివిధ రంగాల్లో డెవలప్మెంట్ప్రోగ్రామ్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ లెనిన్వత్సల్టొప్పో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అడిషనల్కలెక్టర్ అనిల్ కుమార్, వివిధ శాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.