కేసీఆర్​ బర్త్​డేను రాష్ట్ర పండుగగా ప్రకటించాలె

కేసీఆర్​ బర్త్​డేను రాష్ట్ర పండుగగా ప్రకటించాలె
  • కేసీఆర్​ బర్త్​డేను రాష్ట్ర పండుగగా ప్రకటించాలె : ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేను అధికారికంగా నిర్వహించాలని, రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు.  శుక్రవారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ లేకుంటే తెలంగాణ అన్న పదమే లేదని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చేసిన ఉద్యమం బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిందన్నారు. ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాకు దేవుడు, ఆయన బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే పవిత్రమైన దినం.. రంజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దసరా, క్రిస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎట్లనో తెలంగాణకు సీఎం పుట్టిన రోజు కూడా అంతే. తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తి’ అని అన్నారు.

ఊసరవెల్లి రేవంత్..
పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఒక సైకో, శాడిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు. తరచూ పార్టీలు మార్చే రేవంత్‌‌‌‌ను​ చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు. గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రాందీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా మార్చాడని ఆరోపించారు. రేవంత్​ బర్త్​డేను నేరస్తుల దినంగా పాటిస్తామని చెప్పారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింహమని, ఆయన బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేను రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో జరుపుకుంటుంటే క్రిమినల్స్​ డేగా పాటించాలని పిలుపునిచ్చిన సన్నాసి రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఫైరయ్యారు.  రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మింగేస్తాడని, చంద్రబాబు కండ్లల్లో ఆనందం కోసమే కేసీఆర్​ను తిడుతున్నాడన్నారు. తెలంగాణ గాంధీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిట్టే వారిని జైలుకు పంపాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఉరికిచ్చి కొడుతామని హెచ్చరించారు.