
రఘునాథపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. బుధవారం జనగామ జిల్లా లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అనంతరం ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు చురుకుగా పని చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ వ్యవసాయ కమిటీ చైర్మన్ శివరాజు యాదవ్, ఆర్డీవో గోపీరామ్ తదితరులు పాల్గొన్నారు.