బాలానగర్, వెలుగు : ఊరిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ మహబూబ్నగర్జిల్లా బాలానగర్మండలంలోని పెద్దబావి తండా గిరిజనులు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. సోమవారం మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పెద్దబావి తండాకు బయలుదేరారు.
ఈ క్రమంలో సేవాలాల్ టెంపుల్ వద్ద గిరిజనులు, మాల ధరించిన సేవలాల్ మహారాజ్ భక్తులు అడ్డగించారు. తమ గ్రామాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతున్నామని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.