అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. లాస్య అంత్యక్రియలకు అన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం పూర్తి చేసిన అనంతరం.. లాస్య భౌతికకాయాన్ని  కంటోన్మెంట్, కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని ఆమె నివాసానికి తరలించారు. 

పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందర్శనార్థం కొద్దిసేపు అక్కడ ఉంచనున్నారు. ఈ క్రమంలో లాస్య నివాసానికి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే లాస్య భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్రగా బయలుదేరి ఈస్ట్ మారేడ్ పల్లి స్మశానవాటికలో ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు.