ఎమ్మెల్యే మైనంపల్లికి న్యాయవాదుల సన్మానం

ఎమ్మెల్యే మైనంపల్లికి న్యాయవాదుల సన్మానం

మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఏ పార్టీకి చెందిన వారైనా సహించేది లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధికి అందరూ  సహకరించాలని కోరారు. ప్రజలు తన వెంటే ఉన్నారని..రాష్ట్రంలో మల్కాజిగిరిని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. మేడ్చల్​ జిల్లా కోర్టుకు భవన నిర్మాణ స్థలం ..నేరేడ్​ మెట్​ప్రాంతంలోని డైట్​ కాలేజీకి స్థలాన్ని కేటాయింపుకు కృషి చేసిన మైనంపల్లిని మల్కాజిగిరి న్యాయవాదులు అత్మీయత  సన్మానం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిచేందుకు  కృషి చేస్తున్నానని చెప్పారు.పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.