ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి : ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి  :  ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

కరీంనగర్ సిటీ/కోరుట్ల, వెలుగు:  రాష్ట్రంలో ముస్లింల విద్యాప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం కృషి చేస్తోందని నాంపల్లి(హైదరాబాద్) ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటుచేసిన ‘సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026’ గైడ్స్‌‌‌‌‌‌‌‌ను ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల(ఉర్దూ మీడియం)లో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు అందజేశారు. 

ఆనంతరం ఆయన విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. మాజీ ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో 25 ఏండ్లుగా ఆల్ ఇన్ వన్ గైడ్లను పార్టీ తరఫున విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. 

అలాగే కోరుట్లలోని పదో తరగతి ఉర్దూ మీడియం మైనార్టీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు కూడా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఐఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, కోరుట్ల టౌన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ఎంఏ రఫీ, కార్యదర్శి అబ్దుల్ వాజిద్  పాల్గొన్నారు.