స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యే వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్టాఫ్, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు ఉన్నా, ఎలాంటి అనుమానాలు ఉన్నా అసెంబ్లీ, కౌన్సిల్లో సోమవారం ఏర్పాటు చేసే టెస్టింగ్ సెంటర్లలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి టెస్టింగ్ సెంటర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.