
ఆర్మూర్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించి, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆర్మూర్మండలంలోని అంకాపూర్ లో గురువారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరై, స్టూడెంట్స్కు యూనిఫాం, బుక్స్పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యనందించి, విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచి, వారి బంగారు భవిష్యత్కు బాట వేయాలని సూచించారు.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యాబోధన జరగాలన్నారు. అంకాపూర్ స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు వీడీసీ పూర్తి సహకారం అందించడం అభినందనీయమన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. డ్రగ్స్ నియంత్రణ వాల్ పోస్టర్ఆవిష్కరించి, మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారాం, ఎంపీడీవో బ్రహ్మానందం, ఏపీవో గంగారాం, హెచ్ఎంలు నర్సయ్య, సుభాషిణి, టీచర్లు పాల్గొన్నారు.