గవర్నమెంట్ స్కూళ్లపై నమ్మకం కలిగించండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

గవర్నమెంట్ స్కూళ్లపై నమ్మకం కలిగించండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించి, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు.  ఆర్మూర్​మండలంలోని అంకాపూర్ లో గురువారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరై, స్టూడెంట్స్​కు యూనిఫాం, బుక్స్​పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యనందించి, విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచి, వారి బంగారు భవిష్యత్​కు బాట వేయాలని సూచించారు.

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యాబోధన జరగాలన్నారు. అంకాపూర్ స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు వీడీసీ పూర్తి సహకారం అందించడం అభినందనీయమన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. డ్రగ్స్ నియంత్రణ వాల్ పోస్టర్​ఆవిష్కరించి, మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారాం, ఎంపీడీవో బ్రహ్మానందం, ఏపీవో గంగారాం, హెచ్ఎంలు​ నర్సయ్య, సుభాషిణి, టీచర్లు పాల్గొన్నారు.