
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వల్లే సిర్పూర్ కు అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం తుమ్మడి హట్టి ప్రాజెక్టు అని చెప్పారు. తుమ్మిడి హట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించినా కోనప్ప మాట్లాడలేదన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించడానికి కాంగ్రెస్ సర్కారు సిద్దంగా ఉందన్నారు. దీనిపై కోనప్పతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దమ్ముంటే మే 28న 11 గంటలకు తుమ్మిడి హట్టి దగ్గరకు రావాలన్నారు.
కోనప్పను ఏ పార్టీ చెర్చుకోవడం లేదు ఇప్పటికే కోనప్ప అన్ని పార్టీలు తిరిగారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది. ఆ పార్టీలో కోనప్ప చేరాలని కోరుతున్నా. కోనప్పను పార్టీలో చేర్చుకోవాలని కవితకు నేను రిక్వె్స్ట్ చేస్తా. మొనగాన్ని కాబట్టే నేను కోనప్పను ఓడించాను. ఆ పార్టీలో చేరాలని చెబుతున్నా అని పాల్వాయి హరీశ్ అన్నారు.
►ALSO READ | జూన్ 2న కవిత కొత్త పార్టీ.. షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర
ఇక మీదట తను రాజకీయాల్లో ఇండిపెండెంట్గానే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నెలలుగా దూరంగా ఉన్నానని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మే 26న అన్నారు. 9 నెలలుగా అధికార కార్యక్రమాలకు తనను పిలవలేదని, పార్టీకి రాజీనామా ఇంకెందుకని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం క్యాడర్ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోడు భూముల సాగు చేస్తున్న రైతులకు మంత్రి సీతక్క అండగా నిలవడం లేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్కు రాజీనామా విషయం చెప్పకుండానే పార్టీకి దూరమని ప్రకటించారు.