హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంటేనని, అప్పుడు తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందంటూ ఒవైసీ బ్రదర్స్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వాళ్లు తమ కాళ్లు పట్టుకున్నప్పుడు ఒవైసీ బ్రదర్స్ను పైకి పంపాలా? ఎక్కడకు పంపాలి? అనే దానిపై ఆలోచిస్తామని చెప్పారు.
‘కొంతమంది మా బ్రదర్స్ను చంపాలని చూస్తున్నారు. జైల్లో వైద్యంపేరుతో స్లోపాయిజన్ ఇచ్చి హత్య చేస్తారనిపిస్తోంది’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలను ఒవైసీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిపైన ప్రచారం నిర్వహించాలని సవాల్ విసిరారు.