సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ‌

సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ‌

బీజేపీ నేత , గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. COVID-19, లాక్ డౌన్ రోజువారీ కూలీల‌ను ఎక్కువ‌గా ప్రభావితం చేసిందని, ప్ర‌స్తుతం వారికి ఎలాంటి ఉపాధి లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం ఇచ్చే రేష‌‌న్ పైనే ఆధార‌ప‌డి ఉన్నార‌న్నారు.

కొంత‌మంది పేర్లు రేషన్ కార్డుల‌ ‌నుండి తొల‌గించార‌ని అలాంటి వారు లాక్‌డౌన్ ముందు కొత్త‌ రేషన్ కార్డుల‌కై ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు రాజాసింగ్. వారికింకా కొత్త రేషన్ కార్డులు రాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని కాబ‌ట్టి ప్ర‌భుత్వం రేష‌న్ కార్డు హోల్డ‌ర్ల‌తో స‌హ దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకి కూడా రాబోయే 2 నెలలకు ప్రభుత్వం 12 కిలోల బియ్యం మరియు 1500 రూపాయలు అందించాల‌ని కోరారు . రేషన్ కార్డ్ హోల్డర్లందరికీ ప్రభుత్వ సహాయాన్ని ఒకే విధంగా వర్తింపజేయాలని అట్లనే కొత్త రేషన్‌ను త్వరగా జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే రాజసింగ్ లేఖ రాశారు.

mla raja singh writes a letter to cm kcr on concern of ration card holders