యుద్ధం వచ్చేసింది.. రెడీ అవ్వండి.. బీఆర్ఎస్ జెండా పీకేద్దాం : రాజాసింగ్ పిలుపు

యుద్ధం వచ్చేసింది.. రెడీ అవ్వండి.. బీఆర్ఎస్ జెండా పీకేద్దాం : రాజాసింగ్ పిలుపు

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే.. నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. అందులో గోషామహల్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉండాలనేది ఎంఐఎం ఆఫీసు నుంచే డిసైడ్ అవుతుందని చెప్పారు రాజాసింగ్.

2018 ఎలక్షన్స్ లోనూ ఇలాగే జరిగిందన్నారు. ఎంఐఎం సూచనతో తనపై ప్రేమ్ సింగ్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టారని చెప్పారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టారని తెలిపారు. గోషామహల్ ప్రజల ఆశీర్వదంతోనే తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా తానే ఉంటానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణ రాష్ర్ట బీజేపీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తనకే ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గోషామహల్ బీజేపీ కార్యకర్తలు రెడీ అయిపోవాలని పిలుపునిచ్చారు. ఇంకొక యుద్ధం స్టార్ట్ చేద్దాం.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ను పీకి పడేద్దాం.. బీజేపీ గవర్నమెంట్ ను తెలంగాణలో తీసుకొద్దాం అంటూ పిలుపునిచ్చారు.