సినిమా రంగమైనా..రాజకీయాలు అయినా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఆమె వెలుగొందారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.స్టేజి ఎక్కి మైక్ పట్టుకుందంటే తన మాటల తూటాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా విమర్శల బాణాలు సంధించేవారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ... ప్రత్యర్థులపై ఆమె విరుచుకు పడిన తీరు ఒక రేంజ్ లో ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా... పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు.ఆమె అంకితభావాన్ని గుర్తించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆమెను మంత్రి పదవికి ఎంపిక చేశారు.ఫుల్ కాంపిటీషన్ మధ్య రోజా మంత్రి పదవి దక్కించుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది ఆశావహులు ఉండగా ..మినిస్టర్ పదవి రోజాను వరించింది.
మంత్రి దక్కించుకున్నందుకు ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. మినిస్టర్ అయినందుకు షూటింగ్లు మానేస్తున్నానని చెప్పారు.టీవీ, సినిమా షూటింగ్లు ఇక చెయ్యనని..ఇకపై జబర్దస్త్ షోలో కూడా పాల్గొనని చెప్పారు.మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం
14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు
షాంఘైలో ఆకలి కేకలు!