సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ములుగు ఎమ్మెల్యే సీతక్కను, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్షాలకు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సీతక్క. ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్నారు దీంతో పోలీసులకు,సీతక్కకు మద్య తోపులాట జరిగింది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చజరగలేదన్నారు.
కరోనా వారియర్స్ ను ఎందుకు అవమానిస్తున్నారు?
హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం