తమ ఊరును మండల కేంద్రంగా మార్చే వరకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గ్రామంలో అడుగు పెట్టొద్దని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి వాసులు వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామానికి వెళ్లే రోడ్డుపై ‘గర్శకుర్తిని మండలం చేసే వరకు ఎమ్మెల్యే గారు గ్రామంలోకి రావద్దు’ అని ముగ్గుతో రాసి పెట్టారు. గత ఎన్నికల సమయంలో మాట ఇచ్చి తప్పారని, వచ్చే ఎన్నికల్లోపు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు.
- గంగాధర, వెలుగు