కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరు

కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరు

జగిత్యాల: కేసీఆర్ పాలనలో దుబాయికి వలసలు ఆగాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. బుధవారం జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరులో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలోపాల్గొన్న  ఆయన... పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. విద్యుత్ లైన్లను పరిశీలించారు. వీధుల్లో చెత్త ఎక్కువగా ఉండడంతో చీపురు ఊడ్చి, ట్రాక్టర్ లో వేశారు. మురికి కాలువను క్లీన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కరెంట్ కోతలు లేకుండా చేశామని, ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఎన్నో గొప్ప పథకాలతో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. దేశంలో కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరని కొనియాడారు.