జహంగీర్ పీర్ దర్గా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : వీర్లపల్లి శంకర్

జహంగీర్ పీర్ దర్గా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : వీర్లపల్లి శంకర్

షాద్​నగర్, వెలుగు :  జహంగీర్ పీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్గాలో ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. మంగళవారం కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకున్న ఆయన చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలో ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు అధికారి సత్తార్​తో కలిసి ఆయన పరిశీలించారు.  ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతోనే దర్గా వద్ద ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

ఇక్కడికి వచ్చే భక్తులకు వక్ఫ్ బోర్డు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో దర్గా వద్ద  లైట్లు, మెరుగైన రోడ్లు, తాగునీటి విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండొద్దని సూచించారు.  వీర్లపల్లి శంకర్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబర్ ఖాన్, చల్లా శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.