కొత్త గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కొత్త గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ అని.. గత పదేండ్ల కాలంలో బొగ్గు గనులు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో కార్మిక శాతం తగ్గిందని అన్నారు. లక్ష ఉద్యోగులున్న సింగరేణిలో ప్రస్తుతం నలభై వేలమంది కార్మికులు ఉన్నారని.. కొత్త గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు వివేక్ వెంకటస్వామి. 

కొత్తగనులు తీసుకువచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. సింగరేణి సంస్థ 1995 లో BFIR లోకి వెళ్లినప్పుడు... అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న స్వర్గీయ కాకా వెంకటస్వామి అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తో మాట్లాడి NTPC నుండి 400కోట్ల రుణం ఇప్పించి సంస్థను కాపాడినారని అన్నారు. 

కాకా వెంకటస్వామి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, కార్మికుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసేవారని అన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్ ప్రపోజల్ తీసుకువచ్చి ఇంప్లిమెంటేషన్ చేపించింది స్వర్గీయ కాకా వెంకటస్వామి అని అన్నారు. ఈ కార్యక్రంలో మందమర్రి ఏరియా జీఎం  జి.దేవేందర్,సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు స్వరూప రాణి,సింగరేణి అధికారులు,కార్మిక సంఘం నేతలు,కార్మికులు పాల్గొన్నారు.