దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలే : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలే : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

పాలమూరు, వెలుగు: గత ​ప్రభుత్వం పాలనలో ఉత్తర తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. దక్షిణాదిలో జరగలేదని, ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి ఆరోపించారు. మహబూబ్​నగర్ లోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ముద్దు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 

పార్లమెంట్​ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. జిల్లాకు పదేండ్లుగా ఒక్క కంపెనీ కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య , వైద్యం, ఉపాధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సత్తుర్ చంద్రకుమార్ గౌడ్, లక్ష్మణ్​ యాదవ్, కౌన్సిలర్ శాంతయ్య పాల్గొన్నారు.