
స్టేషన్ఘన్పూర్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్హయాంలో నిరంకుశ పాలన సాగిందని, పదేళ్లు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ఆరోపించారు. స్టేషన్ఘన్పూర్, చిల్పూరులలో గురువారం కాంగ్రెస్మండల, మున్సిపాలిటీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. చీఫ్గెస్ట్గా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హైదరాబాద్లోని ధర్నా చౌక్ను ఎత్తేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అదే ధర్నా చౌక్లో ఆయన కూతురు కవిత మా అయ్య నిజాయితీపరుడని ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
బ్రిటీషోళ్ల ఏజెంట్లు బీజేపోళ్లని విమర్శించారు. బిల్లా, రంగా మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కమిటీల్లో పాత, కొత్త భేదం లేకుండా సమర్థులైన వారినే అధ్యక్షులుగా ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్పరిశీలకుడు లింగయ్యయాదవ్, చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీధర్రావు, ఏఎంసీ చైర్పర్సన్లావణ్య తదితరులున్నారు