కేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన

కేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​హయాంలో నిరంకుశ పాలన సాగిందని, పదేళ్లు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​ఆరోపించారు. స్టేషన్​ఘన్​పూర్​, చిల్పూరులలో గురువారం కాంగ్రెస్​మండల, మున్సిపాలిటీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. చీఫ్​గెస్ట్​గా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హైదరాబాద్​లోని ధర్నా చౌక్​ను ఎత్తేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అదే ధర్నా చౌక్​లో ఆయన  కూతురు కవిత మా అయ్య నిజాయితీపరుడని ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

బ్రిటీషోళ్ల ఏజెంట్లు బీజేపోళ్లని విమర్శించారు. బిల్లా, రంగా మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​కమిటీల్లో పాత, కొత్త భేదం లేకుండా సమర్థులైన వారినే అధ్యక్షులుగా ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్​పరిశీలకుడు లింగయ్యయాదవ్​, చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీధర్​రావు, ఏఎంసీ చైర్​పర్సన్​లావణ్య తదితరులున్నారు