ప్రచారంలో యువకుడిని తిట్టిపోసిన ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్

ప్రచారంలో యువకుడిని తిట్టిపోసిన ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్

పరిషత్ ప్రచారం, బహిరంగ సభల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. సమస్యలపై ప్రజలు నిలదీస్తే.. దుర్భాషలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా హోతి బిలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నీటి సమస్యపై ప్రశ్నించిన యువకుడిని బూతులు తిట్టారు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ పరిధోద్దీన్ తన స్వగ్రామం హోతి బిలో జరిగిన సభలో పాల్గొన్నారు. త్రాగునీటి సమస్యపై గ్రామస్తుడు ఎమ్మెల్సీ ని నిలదీసాడు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప నీటి సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎమ్మెల్సీ తొలుత సముదాయించే ప్రయత్నం చేసినా ఆ తర్వాత  రెచ్చిపోయారు. దొంగ ముండా కొడుకులు అంటూ తిట్లు అందుకున్నారు. బూతు పదాలు వాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆపై ఎమ్మెల్సీ అనుచరులు.. యువకుడిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. నీటి  సమస్య పై ప్రశ్నిస్తే బూతులేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.