బీజేపీవి మత రాజకీయాలు : జీవన్ రెడ్డి

బీజేపీవి మత రాజకీయాలు : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు : సమాజాన్ని కుల, మతాల పేరిట చీల్చడమే బీజేపీ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇందిరాభవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాగా ఎంపీ ఎన్నికల్లో మోదీ ఓడిపోతారన్నారు. మొన్నటి వరకు మోదీ 400 సీట్లు అన్నారని,  ఇప్పుడు 350  గెలుస్తామంటున్నారని, వారానికి 50 చొప్పున సీట్లు తగ్గుతున్నాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలోనే అన్నివర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తాను మంత్రిగా పనిచేసినప్పుడు జగిత్యాల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. సమావేశంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ జ్యోతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.