Liquor Scam : ఈడీ ఆఫీసుకు కవిత లీగల్ టీం

Liquor Scam : ఈడీ ఆఫీసుకు కవిత లీగల్ టీం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత లీగల్ టీంకు.. ఈడీ ఆఫీసు నుంచి పిలుపు వెళ్లింది. అధికారుల నుంచి ఫోన్ రావటంతో.. హుటాహుటిన ఆఫీసుకు చేరుకున్నారు అడ్వకేట్ సోమా భరత్. ఆయనతో ఇతర అడ్వకేట్లు కూడా ఆఫీసుకు వచ్చారు. అయితే సోమ భరత్ మాత్రమే ఆఫీసులోకి వెళ్లారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన్ను పిలవాల్సిన అవసరం ఏంటీ అనేది ఆసక్తిగా మారింది. మూడోసారి విచారణకు.. మార్చి 21వ తేదీ ఉదయం హాజరైన ఎమ్మెల్సీ కవితను.. ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు అధికారులు. ఇవాల్టి విచారణకు ఆమె తన పాత ఫోన్లను కూడా తీసుకెళ్లారు. 

ఈడీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు భద్రతా సిబ్బంది. చుట్టుపక్కల ఉన్న అందర్నీ అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. మహిళా పోలీసులు సైతం భారీగా ఉన్నారు. కేంద్ర బలగాలు సెక్యూరిటీ చూస్తున్నాయి.