పసుపు బోర్డునుఇంకెన్ని సార్లుప్రారంభిస్తరు?..బీజేపీ లీడర్లపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

పసుపు బోర్డునుఇంకెన్ని సార్లుప్రారంభిస్తరు?..బీజేపీ లీడర్లపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్ని సార్లు ప్రారంభిస్తారని బీజేపీ లీడర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికే 2 సార్లు ప్రారంభించారని, ఇప్పుడు మూడోసారి ఓపెన్ చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని ఎద్దేవా చేశారు. పదే.. పదే ప్రారంభోత్సవాలు చేయడం కాదని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

శనివారం కవిత సమక్షంలో పలువురు స్టూడెంట్లు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిజామాబాద్ లోనే పసుపు క్వింటాల్ కు రూ.15 వేల మద్దతు ధర ప్రక టించి వెళ్లాలని అమిత్ షాను డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై జాగృతి లీడర్లు నిలదీస్తుంటే కాంగ్రెస్ భయపడుతున్నదన్నారు. కాగా, తెలంగాణ జాగృతితో కలిసి సీపీఐ సాంస్కృతిక విభాగం యువ కళావాహిని కలిసి పనిచేస్తుందని కేరళకు చెందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సందోష్ కుమార్ తెలిపారు. కవితతో ఆమె నివాసంలో ఆయన భేటీ అయ్యారు.