లిక్కర్ స్కాంలో ఈ నెల 11న సీబీఐ విచారణకు అంగీకరిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 11న 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీకి మెయిల్ ద్వారా కవిత సమాచారం ఇచ్చారు.
లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మరికొందరిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, మంగళవారం విచారణకు రావడం వీలుకాదని సీబీఐకి కవిత లేఖ రాశారు. సోమవారం ప్రగతి భవన్లో కేసీఆర్తో ఆమె భేటీ తర్వాత ఢిల్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు లెటర్ పంపారు. ఈ కేసులో కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వాలన్న తన విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఈ–మెయిల్ అందిందని కవిత తెలిపారు. ఈ నెల 6న తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని.. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని సీబీఐకి లేఖలో తెలియజేశారు. కవిత మెయిల్ కు రిప్లై ఇచ్చిన సీబీఐ.. ఈ నెల 11న తన నివాసంలోనే విచారిస్తామని చెప్పారు. దీనికి అంగీకరించిన కవిత 11న సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు.