ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు. ఆమె వెంట భర్తతోపాటు.. ఇతర బీఆర్ఎస్ లీడర్స్ ఇంటి నుంచి వచ్చారు. ఈడీ ఆఫీసులోకి ఒక్కరినే అనుమతించారు అధికారులు. విచారణకు హాజరుకావటం ఇది మూడో సారి. మార్చి 20వ తేదీ సోమవారం 10 గంటలకు పైగా ఆమెను విచారించారు అధికారులు. ఇవాళ మళ్లీ హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
మరో వైపు ఈడీ ఆఫీస్ దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కవిత విచారణలో ఇవాళ కీలక పరిణామాలు ఉంటే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆమె తన వెంట గతంలో ఉపయోగించిన ఫోన్లను కూడా ఈడీ ఆఫీసుకు తీసుకురావటం విశేషం.