హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవిత గారిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆమె హోం క్వారంటైన్లో ఉండనున్నారు. అంతేకాకుండా ఈ ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో రేపు (బుధవారం) మండలి సమావేశంలో జరగాల్సిన ప్రమాణ స్వీకారం కూడా ఆగిపోయింది.