బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల రాజీనామా

బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల రాజీనామా

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రతిరోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు ఎవరో ఒకరు సిద్దమవుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూపల్లి కృష్ణారావుతో కలసి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్దమని చెప్పారు. 2023 అక్టోబర్ 31న ప్రియాంక గాంధీ సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తుంది. మరోవైపు ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు(అక్టోబర్ 27) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.