రేపు జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి..!

రేపు జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి..!

హాజరుకాకపోతే చర్యలుంటాయని హెచ్చరిక

జాతీయ మహిళా కమిషన్ ముందు రేపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి అనుచిత వాఖ్యలు చేసినందుకు సుమోటోగా స్వీకరించి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం11 : 30 నిమిషాలకు జాతీయ మహిళా కమిషన్ ముందు కౌశిక్ రెడ్డి హాజరుకానున్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తమిళిసై గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 21న ఉదయం 11:30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కమిషన్ ముందు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెబుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.