కేటీఆర్ చర్చకు వస్తే ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకుంటా

కేటీఆర్ చర్చకు వస్తే ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకుంటా

తార్నాక: ఉద్యోగాల భర్తీపై చర్చకు రావాలని మంత్రి కేటీఆర్‌‌కు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌ రావు సవాల్ విసిరారు. ‘ఓయూ ఆర్ట్స్ కాలేజ్ చరిత్రాత్మకమైంది. ఉద్యోగాల భర్తీపై చర్చకు కేటీఆర్ ఇక్కడకు రావాలి. న్యాయవాదుల కోసం ఏం చేశావ్ అన్నావ్.. న్యాయవాదిగా పలు సందర్భాల్లో వారి కోసం పోరాటం చేశా. సాంక్షన్ పోస్టులను భర్తీ చేశావ్. 32 వేల టీఎస్పీఎస్సీ , పోలీస్ ఉద్యోగాలు తప్ప.. మరే పోస్టులైనా భర్తీ చేశారా? చాలా వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలర్ చేసి.. ఉద్యోగాలిచ్చాం అంటే ఎలా రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. లెక్చరర్లు, ప్రొఫెసర్ల భర్తీ ఎందుకు చేయడం లేదు? తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన ఉస్మానియా గడ్డ దగ్గర 11 నుంచి 12 గంటల వరకు ఎదురు చూస్తా. కేటీఆర్ చర్చకు వస్తే నేను ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకుంటా’ అని రామచందర్ రావు స్పష్టం చేశారు.