సింగరేణి సీఆర్టీలకు టైమ్‌‌ స్కేల్‌‌ అమలు చేయాలి : శ్రీపాల్ రెడ్డి

సింగరేణి సీఆర్టీలకు టైమ్‌‌ స్కేల్‌‌ అమలు చేయాలి : శ్రీపాల్ రెడ్డి
  • సంస్థ ఎండీకి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న సీఆర్టీ (క్యాజువల్‌‌ రిలీఫ్‌‌ టీచర్స్‌‌)లకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. గురువారం సింగరేణి సీఎండీ బలరాంను పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు.

 సింగరేణి విద్యాసంస్థల్లోని టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టు టీచర్లందరికీ 12 నెలల వేతనం ఇవ్వాలని కోరారు. వారికి కూడా సింగరేణి ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎండీ బలరాం సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు.