బాడీ 2 ముక్కలైంది : మొబైల్.. ఆ యువతి ప్రాణాలు తీసింది

బాడీ 2 ముక్కలైంది : మొబైల్.. ఆ యువతి ప్రాణాలు తీసింది

హైదరాబాద్ : MMTS రైలు కింద జారిపడి ఓ యువతి మరణించిన తీరు అందరినీ కలచివేసింది. అనుకోకుండా మొబైల్ కిందపడటంతో..సెల్ ఫోన్ అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా కాలుజారి ఆమె కూడా ట్రైన్ కిందపడిపోయింది. దీంతో ఆమెపై నుంచి రైలు కదలడంతో ఆమె బాడీ రెండు ముక్కైలై అక్కడికక్కడే మరణించింది. కళ్లముందే క్షణాల్లో ఈ సంఘటన జరగడంతో ట్రైన్ లో ప్రయాణికులు అంతా కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని సీతాఫల్ మండిలో బుధవారం ఉదయం జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి…

సీతాఫలమండి ప్రాంతానికి చెందిన అశ్విని(20) అనే యువతి బుధవారం ఉదయం ఎంఎంటీఎస్ రైలులో ఆఫీసుకు బయలుదేరింది. మార్గమధ్యంలో రైలులో నుంచి పొరపాటున యువతి ఫోన్ జారి కింద పడిపోయింది. ట్రైన్ కదులుతుండగానే ఆ ఫోన్ ని తీసేందుకు యువతి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు జారి పట్టాలపై పడింది. అదే సమయంలో ట్రైన్ కదులుతుండటంతో ఆమె మీద నుంచి ట్రైన్ పోయింది. దీంతో ఆమె శరీరం రెండు ముక్కలయ్యింది. అక్కడికక్కడే యువతి ప్రాణాలు కోల్పోయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.