- మరికొన్ని రూట్ల మార్పులు
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలో ఎంఎంటీఎస్రైళ్ల నిర్వహణలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్ని రూట్లలో మార్పులు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన వాటిలో లింగంపల్లి – ఉమ్ధానగర్, ఉమ్ధానగర్–లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్నుమా, ఫలక్నుమా–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.
మార్పులు జరిగిన వాటిలో ప్రస్తుతం రామచంద్రాపురం–హైదరాబాద్ మధ్యనడిచే రైళ్లను తెల్లాపూర్ హైదరాబాద్ మధ్య నడిపించనున్నారు. అలాగే హైదరాబాద్–లింగంపల్లి , లింగంపల్లి–హైదరాబాద్మధ్య నడిచే రైళ్లను యథావిధిగా నడపున్నారు.
