
చెన్నై: కమల్ హాసన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ అరుణాచలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలక మండలి, పరిపాలనా కమిటీ.. పార్టీ చీఫ్ కమల్ హాసన్ను ఎగువ సభకు అభ్యర్థిగా పేర్కొంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాయి.
2024 లోక్సభ ఎన్నికల ముందు ఎంఎన్ఎం, డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఎంఎన్ఎం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకే, కాంగ్రెస్, వామపక్ష కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసింది.
ఇందుకు బదులుగా డీఎంకే.. తమిళనాడు నుంచి ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎంకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ సీటును ఎంఎన్ఎంకు అధికారికంగా కేటాయించారు.