జీపీ ఆఫీస్ను ముట్టడించిన మహిళలు

జీపీ ఆఫీస్ను ముట్టడించిన మహిళలు

ధర్మసాగర్, వెలుగు: కాలనీలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి స్థానిక మహిళలు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ధర్మసాగర్​ మండల కేంద్రంలో మోడల్ కాలనీకి చెందిన మహిళలు జీపీ ఆఫీస్​ను ముట్టడించి మాట్లాడుతూ పేరుకే మోడల్​కాలనీ కానీ సమస్యల కాలనీగా నిలిచిపోతుందన్నారు. 15 రోజుల నుంచి నీళ్లు సరిగా రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 

స్ర్టీట్​ లైట్లు లేవని, లైట్స్​వేయమని అడిగితే లైట్ కు రూ.200, కూలి రూ.300, మొత్తం రూ.500 ఇస్తే లైట్స్ వేస్తామని పంచాయతీ సిబ్బంది  అంటున్నారని ఆరోపించారు. కాలనీలో పందులతో పారిశుద్ధం పడకేసిందని, దోమల బెడద ఎక్కువై రోగాల బారిన పడుతున్నామన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సయ్యద్ పాషా నీటి సమస్యను రెండు, మూడు రోజుల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.