
కరోనా పై పోరాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 15వేల కోట్ల రూపాయలను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ముందుగా 7వేల 774కోట్లను తక్షణం రిలీజ్ చేసింది. మిగితా నగదును దశలవారిగా ఇస్తామని తెలిపింది. యుద్ధప్రాతిపదికన చేయవలసిన పనులను రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ముందుగా డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని, కరోనా వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ చేయడానికి సదుపాయాలు, కావలసిన మందుల సేకరణ, భవిష్యత్తులో వ్యాధి నివారణను ఎదుర్కోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలకు సహాయపడటానికి 10ఉన్నతస్థాయి టీంలను రెడీ చేసింది కేంద్రం. ఈ బృందాలను మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు తరలించారు.
కరోనా పేషెంట్స్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ 5వేల బోగీలను, 80వేల అదనపు పడకలను ఐసొలేషన్ వార్డులుగా మార్చేందుకు రెడీ అయింది. ఈ రైల్వేలో 2వేల 500మంది డాక్టర్లు, 35వేల మంది పారామెడిక్స్, 586 హెల్త్ యునిట్స్, 45 సబ్ డివిజినల్ హాస్పిటల్స్, 56 డివిజినల్ హాస్పిటల్స్, 8 ప్రొడక్షన్ యునిట్ హాస్పిటల్స్ మరియు 16 జోనల్ హాస్పిటల్స్ ఉంటాయని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరి లవ్ అగర్వాల్ చెప్పారు.
కరోనా వైరస్ వలన భారతదేశ ఆర్థిక పరిస్థితి మారిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య విధాన నివేదికలో తెలిపింది. దీంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడిపోతుందని చెప్పింది.