
పాకిస్తాన్కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో భారత్ కు వ్యతిరేకంగా జరిగే ఏ టెర్రరిస్టు అటాక్ అయినా యుద్దంగానే భావిస్తాం.. భారత్ పౌరులను ఏ ఒక్కరిని టచ్ చేసినా.. ప్రతీసారీ యుద్దమే చేస్తామని ప్రధాని మోదీ పాక్ కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ రెండు రోజులుగా భారత్ లోని కీలక ప్రాంతాలు, నగరాలపై డ్రోన్, క్షిపణి దాడులకు ప్రయత్నించిన తర్వాత భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ,భారత సాయుధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.ఈ సందర్బంగా భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా దేశానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధ చర్యగా పరిగణించి తగిన విధంగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. భారతదేశం,పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
శనివారం(మే 10) ఉదయం భారత్, పాక్ ఉద్రిక్తతలకు సంబంధించిన అప్డేట్స్ ను భారత విదేశాంగ శాఖ, డిఫెన్స్ అధికారులు ప్రకటిచారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే చర్యలు పూనుకుంటోంది.. ప్రతిస్పందనగా భారత్ ధీటైన జవాబు చెబుతోందని భారత్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు. పాకిస్తాన్ సైన్యం పశ్చి సరిహద్దులపై నిరంతరం దాడి చేస్తోందని.. భారత్ సైన్యం సమర్ధవంతంగా దాడులను ఎదుర్కొందని కల్నల్ సోఫియా ఖురేషి మీడియాలో సమావేశంలో తెలిపారు. గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, పెద్ద పెద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి యుద్ధ జెట్లను ఉపయోగించిందని ఆమె చెప్పారు.
►ALSO READ | India Vs Pak:భారత్కు సంఘీభావంగా..సేవలు నిలిపివేసిన ట్రావెల్ ఏజెన్సీ ‘ఇక్సిగో’
అయితే పాకిస్తాన్ సైన్యం దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు ఖురేషి. 26 చోట్ల వైమానిక చొరబాటుకు పాక్ ప్రయత్నించిందన్నారు. ఉదంపూర్, బుజ్, పఠాన్ కోట్, బటిండాలోని వైమానిక దళ స్థావరాలపై దాడికి పాక్ ప్రయత్నించింది. అయితే ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టి డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసిందన్నారు ఖురేషి.
పాక్ ఉద్దేశపూర్వకంగా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆగ్రహించిన భారత్ సాయుధ దళాలు ప్రతీకారంగా.. పాక్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వలను లక్ష్యంగా దాడుల చేశామని, పౌరులకు ఎటువంటి హాని కలిగించలేదని ఆర్మీ అధికారి తెలిపారు. రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్ ,చునియన్లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఫైటర్ జెట్ల ద్వారా దాడులు చేశామని తెలిపారు.