బీజేపీ హెడ్ ఆఫీసు అనుబంధ బిల్డింగ్ ప్రారంభించిన మోడీ

బీజేపీ హెడ్ ఆఫీసు అనుబంధ బిల్డింగ్ ప్రారంభించిన మోడీ
  • రాష్ట్రం నుంచి పాల్గొన్న వివేక్​ వెంకటస్వామి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని దీన్​దయాల్​ఉపాధ్యాయ (డీడీయూ) మార్గ్​లో బీజేపీ హెడ్ ఆఫీసు అనుబంధ భవనాన్ని మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కొత్త బిల్డింగ్​లో ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మల్లిక నడ్డా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నడ్డాతో పాటూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేందర్ సత్య దేవ్ దంపతులు పూజలో పాల్గొన్నారు. మహా చండీయాగం, శ్రీరాముడి పూజలు ఘనంగా నిర్వహించారు. పూజల తర్వాత నడ్డాతో వివేక్ ప్రత్యేకంగా ముచ్చటించారు. అనంతరం నడ్డా, బీజేపీ జనరల్ సెక్రటరీలు (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, సునీల్​ బన్సల్, రాష్ట్ర బీజేపీ ఇన్​చార్జ్ తరుణ్ చుగ్​తో కలిసి సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు.