భారత్-నేపాల్ మధ్య పెట్రోలియం పైప్ లైన్ ప్రారంభం

భారత్-నేపాల్ మధ్య పెట్రోలియం పైప్ లైన్ ప్రారంభం

భారత్-నేపాల్ మధ్య నిర్మించిన పెట్రోలియం ప్రోడక్ట్స్ పైప్ లైన్ ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బిహార్ లోని మోతిహారీ-నేపాల్ లోని అమ్లేక్ గంజ్ ల మధ్య ఈ పైప్ లైన్ నిర్మించారు. నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీతో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పైప్ లైన్ ను ఇనాగరేట్ చేశారు మోడీ. దక్షిణ ఆసియాలో మొదటి పెట్రోలియం పైప్ లైన్ ప్రారంభించడం అత్యంత సంతృప్తినిచ్చిందన్నారు ప్రధాని మోడీ. నేపాల్ ప్రభుత్వ సహకారం… రెండు దేశాల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు.