మోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారు

మోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారు

ప్రధాని మోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ మొదటి సారి తిరుమలకు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకుంటారు.

తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మోడీ. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.