ఇష్టమైనవి తినలేకపోతున్నా..షమీ షాకింగ్ కామెంట్

ఇష్టమైనవి తినలేకపోతున్నా..షమీ షాకింగ్ కామెంట్

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ దుమ్ము రేపుతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు  13 మ్యాచ్లలో 23 వికెట్లు తీశాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో అద్బుత ప్రదర్శన చేసిన  షమీ..మ్యాచ్ అనంతరం కామెంటేటర్ రవిశాస్త్రితో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

ఇష్టమైనవి తినలేకపోతున్నా..

రవిశాస్త్రి, షమీ మధ్య ఆసక్తికరణ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా నీకు ఇష్టమైన ఫుడ్ ఏదని రవిశాస్త్రి షమీని అడిగాడు. అయితే ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నాను కదా..నాకు ఇష్టమైన ఫుడ్ తినలేకపోతున్నానంటూ షమీ బదులిచ్చాడు. షమీకి బిర్యానీ అంటే విపరీతమైన ఇష్టం. అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఉన్న షమీ..తన ఫేవరెట్ బిర్యానీని తినలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో బిర్యానీని మిస్ అవుతున్నానంటూ షమీ చెప్పుకొచ్చాడు. 

షమీకి పర్పు క్యాప్

సన్ రైజర్స్ మ్యాచ్ కు ముందు 19 వికెట్లతో ఉన్న  షమీ..సన్ రైజర్స్  మ్యాచ్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. కేవలం 20 పరుగులే ఇచ్చాడు. దీంతో ఇప్పటి వరకు 13 మ్యాచుల్లో 23 వికెట్లు దక్కించుకుని..అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో టాప్ లోకి దూసుకెళ్లాడు. దీంతో షమీ  పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. 

గుజరాత్ సూపర్ విక్టరీ

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 34 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు సాధించింది. గిల్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ 47 రన్స్ కొట్టాడు.  ఆ తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 64 పరుగులు సాధించగా..భువనేశ్వర్ కుమార్ 27 పరుగులతో రాణించాడు.