టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు శిరిష్ కుమారుడు, హీరో ఆశిష్ పెళ్లికి రెడీ అయిపోయాడు. ఏపీకి చెందిన బిజినెస్ మెన్ కూతురు అద్వైత రెడ్డితో ఆశిష్ ఎంగేజ్మెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ నెల (ఫిబ్రవరి 14న) జైపూర్లో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది.ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ సెలబ్రిటీల ఇంటికి వెళ్లి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు.
రీసెంట్గా మెగాస్టర్ చిరంజీవికి, వెంకటేష్, నాగార్జున, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్కి ఇన్విటేషన్స్ అందజేశారు. లేటెస్ట్గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లిన ఈ కొత్త జంట..మంచు ఫ్యామిలీని తమ పెళ్ళికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే నూతన వధువరులను మెహన్బాబు ఆశీర్వదించి..పెళ్ళికి అటెండ్ కాలేకపోవొచ్చని ముందస్తుగా..తన ఇంట్లోనే పూజా మందిరం వద్ద దండలు మార్పించి ఆశీర్వాదాలు అందించారు.
ఎందుకంటే..ప్రస్తుతం మోహన్ బాబు భారీ స్థాయిలో కన్నప్ప మూవీని నిర్మిస్తున్నారు. దీంతో వీరి పెళ్లి సమయానికి కన్నప్ప కొత్త షెడ్యూల్ కొరకు న్యూజిలాండ్ వెళ్తున్నాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.
ఇక ఆశిష్ సినిమాల విషమానికి వస్తే..రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్. ఈ సినిమాలో అతనికి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. సినిమా పెద్దగా హిట్ సాధించకపోయిన హీరోగా ఆశిష్ కు మంచి పేరును తీసుకువచ్చింది. విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేశాడు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.